Tuesday, August 26, 2014
దేశ భక్తి
దేశ భక్తి అంటే జెండా పట్టుకుని నాకు దేశ భక్తి ఎక్కువ అనడం కాదు. దేశ భక్తి అనేది ప్రతి వ్యక్తిలోను ఉంటుంది. కాకపోతే దానిని వెలికితీయాలి. దేశ భక్తి అనేది మనసులోంచి రావాలి. దేశానికి సేవ చేయాలి. ఈ దేశం నాకు ఏమి చేసింది అనడం కాదు. నేను దేశానికి ఏమి చేశాను అన్నది ముఖ్యం. దేశాన్ని కాపాడడానికి ఎక్కడకి వెళ్ళాలి? దానికి ఎక్కడకి వెళ్ళనక్కరలేదు, ఆపదలో ఉన్న వారికీ సేవ చేస్తే, దేశానికి సేవ చేసినట్లే. మనం ఇంత స్వేచ్చగా మనం ఇష్టం వచిన్నట్టు ఉన్నామంటే దానికి కారణం, ఎందరో మహానుభావులు కృషి ఫలితమే. ఎన్నో వేల కుటుంబాలు సహితం దేశార్పణ చేసాయి. అటువంటి ఈ దేశాన్ని మనం ఎంతో జాగ్రత్తగా కాపాడుకోవాలి. నాకు బలం లేదు, శక్తి లేదు దేశాన్ని ఎలా కాపాడను? దేశాన్ని కాపాడడానికి బలం బలగం అవసరం లేదు. ఆత్మస్థైర్యం, పట్టుదల, కృషి ఉంటే చాలు. న్యాయదేవత కళ్ళకు గంతలు కట్టి ఉంటాయి. ఎందుకంటే అన్యాయాన్ని చూడలేక, ఆ కళ్ళకు గంతలు విప్పే రోజు రావాలి! రావాలంటే న్యాయం, ధర్మం, నీతి అనేవి మనం అస్త్రాలుగా ధరించి అన్యాయాన్ని ఎదిరించాలి. భారతీయ పౌరునిగా మన వంతు భాద్యత నిర్వహించడానికి ప్రతి ఒక్క పౌరుడు ఒక శక్తీవంతుడై వెలుగెత్తి పోరాటం చేయాలి. భారతమాత ఋణం తీర్చుకోవాలి.న్యాయానికి మారుపేరుగా మనమందరం తయారుకావాలి. న్యాయం లో న్యాయ దేవతను, ధర్మం లో ధర్మరాజు ను, సత్యం లో సత్య హరిశ్చంద్రున్నిమించి పోవాలి. మన దేశం కోసం ధన, మాన, ప్రాణాలు సైతం లేక్కచేయకూడదు. మళ్లీ తెల్లదొరల చేతుల్లో మన జీవితాలు నలగకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరు నడుం బిగించాలి ముందుకు సాగాలి . ప్రజాసేవే దేశసేవ ". భగత్ సింగ్ లాంటి మహాత్ములు పుట్టిన దేశం, రాముడు పరిపాలించిన దేశం, సతి సావిత్రి లాంటి మహా పతివ్రతలకు పుట్టినిల్లు మన భారతదేశం. మన దేశ బాద్యత మనపై ఆదారపడి ఉంది. మేల్కొనండి! మన దేశం పట్ల భక్తి బావంతో మెలగండి. శివాజీ రాజ తల్లి ఆయనకు ఉగ్గుపాలకు బదులు దేశ భక్తిని నూరి పోసింది. దేశం యందు భక్తి శ్రద్ధలతో మెలుగుతారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను .
జైహింద్
-స్పూర్తి
Posted by
Sneha Hastam
0
comments
Read More
జన్మ సార్ధకత
మనిషిగా పుట్టడం, చావడం, కూటి కోసం కష్టపడడం జీవతం అంత కూడా, జీవితం అంటే ఇదేనా? ప్రతి ఒక్కరం కూడా ఇదే ప్రశ్నవేసుకున్నటైతే జవాబు మనకే తెలుస్తుంది. మనిషిగా పుట్టిన తర్వాత ఈ మనవ జన్మ కు సార్ధకత అంటూ ఉండాలి. దానికి మనం చేయవలిసినవి చాల ఉన్నాయి, ఆత్మా విశ్వాసాన్ని ఏ మాత్రం సడలనివ్వకూడదు , మనిషిని ముందుకు నడిపేదే ఆత్మా విశ్వాసం. ప్రతి మనిషికి లక్ష్యం అనేది ఉండాలి. ఉన్నత శిఖరాలు అధిరోహించాలంటే మనిషి లక్ష్యం వైపు ప్రయాణం సాగించాలి. మనిషిని మనిషిగా నిలిపేదే మనస్సు. మనస్సు అనేది మనకు రెండు సంకేతాలను పంపుతుంది, అవి ఏమిటంటే మంచి, చెడు అయితే మనం ఎక్కువ చేడుకే ఆకర్షితులం అవుతాం. దానికి కారణం మంచి అనేది కష్టంగాను చెడు అనేది సుఖం గాను కనపడుతుంది. మనం మంచిని మాత్రమే స్వీకరించాలి, (ఉదా: హంస పాలు, నీళ్ళు రెండు కలిసి ఉన్నప్పటికీ పాలను మాత్రమే స్వీకరిస్తుంది, నీరును వదిలేస్తుంది.) మనం కూడా హంసను ఆదర్శంగా చేసుకుని మంచిని స్వీకరించి చెడును వదిలిపెట్టాలి. సమాజంలో మనకంటూ ఒక ఉన్నత స్ధానాన్ని సంపాదించుకోవాలి, మనం సంపాదించుకున్న ఉన్నత స్ధానంలో ప్రజా సేవ చేసుకుంటూ మనం ఎదుటి వారికీ ఆదర్శం కావాలి. మానవ జీవితానికి ఎన్నో ఓడిదిడుకులు వస్తాయి. కానీ వాటిని ఎదిరించి పోరాడి గెలవడమే జీవితం. కష్ట సుఖాలను చిరునవ్వుతో ఆహ్వానించేవాడే, జీవితంలో పైకి రాగలడు. ఎవరి వలనో నా జీవితం ఇలా తయారైంది, అనుకోవడం అవివేకం. భాదపడడం కంటే మనోధైర్యాన్ని పెంచుకుని, నేను ఏదైనా సాదించగలను అనే భావం ముందు మనం ఏర్పరుచు కోవాలి.
మనం ఎంత సంపాదించినా, కూడా పట్టుకేల్లది ఏమిలేదు. మనం బ్రతికి ఉన్నత కాలం, మనం చేసిన మంచి పనులు, పేరు ప్రఖ్యాతలను మాత్రమే తీసుకెళ్ళగలం. మనం ఎవ్వరికి మంచి చేయక పోయిన పర్వాలేదు, ఎట్టి పరిస్దితులలోను చెడు మాత్రం చేయకూడదు. మనకి సహాయం చేసిన వారిని ఎప్పటికి మరువకూడదు. ప్రస్తుతం మనకి ఆదర్శంగా స్వామి వివేకానంద ను చెప్పవచ్చు. ఆయన చెప్పిన ప్రసంగాలు, విదేశియులను ఎంతగా ఆకట్టు కున్నాయో మనకు తెలుసు.
" లెమ్ము ! ధైర్యవంతుడవై, బలవంతుడవై, మనసు నిలుపుము. భాద్యతను అంతయు నీ మీదనే పెట్టుకొనుము మరియు నీ విధికి నీవే కారణమని తెలుసుకో. నీకు కావాల్సిన బలమంతా, సహాయమంత నీయందే కలదు.కాబట్టి భవిష్యతును నీవే నిర్మించుకోనుము"
- స్వామి వివేకానంద
ఎంత చక్కగా చెప్పారు, విదేశాలు వెళ్లి అక్కడ స్వామి వివేకానంద "ప్రియమైన సోదర సోదరీమనులార!" అని సంబోధించడం వాళ్ళ మన భారత దేశ సంస్కృతి విదేశాలలో మారుమ్రోగింది.
మనకు మనమే ఏదో ఉహించుకుని నేను చేత కాని వాడిని అని అనుకోవడాన్ని "ఆత్మదూషణ" అంటారు. నేను ఏదైనా సాదించగలను అనే నమ్మకం ఉండాలి. నమ్మకం లేనిదే మనిషి జీవితమే లేదు. నమ్మకం అనేది మనిషికి శ్వాస వంటిది, సుఖ దు:ఖలనేవి రాత్రి పగలు వంటివి. ఈ రెండు సహజం. మనిషికి ఆధ్యాత్మికం (దైవచింతన) ఉండాలి. అది లేని నాడు మానవులు భయం భక్తీ లేకుండా విచ్చలవిడిగా వారి ఇష్టం వచ్చినట్లు సంచరిస్తారు. ఏ మతమైనప్పటికి మంచినే బోదిస్తుంది తప్ప చెడును భోదించదు. సర్వమతాల ఇక్యతతో జన్మ సార్ధకత తెలుసుకున్నారని ఆశిస్తూ...
--స్ఫూర్తి
Posted by
Sneha Hastam
0
comments
Read More
Tuesday, May 14, 2013
తెలుగువెలుగు
సంస్కృతి సంప్రదాయాలకు పుట్టినిల్లు మన భారతదేశం. ప్రపంచ దేశాలకు సంప్రదాయ వెలుగు రేఖలను ప్రసరిస్తూ ప్రపంచానికే ఆదర్శవంతమైన దేశంగా విరాజిల్లుతున్న ఆధ్యాత్మిక దేశం మన భారత దేశం.భారతీయ సోదర యువకులారా ! ఎటుపోతుంది మన తరం ప్రాశ్చత్యదేశల మోజులో మన దేశ సంస్కృతి సంప్రదాయాలను విస్మరిస్తునమేమో అలోచిచండి? నాగరికత పేరుతో మన తల్లి భారతమాతను మరువద్దు. "దేశ భాషలందు తెలుగు లెస్స" అన్న శ్రీ కృష్ణ దేవరాయుల మాట మరువుగలమా? తెలుగు వారైనా మనమందరం కమ్మనైన తెలుగు బాష సౌరభాలను ప్రసరిద్దాం,తెలుగు జాతికి పునర్వైభవం తీసుకోద్దాం. భారతమాత ముద్దు బిడ్డలమై దేశ ఖ్యాతిని సువర్ణ అక్షరాలతో లిఖిద్దాం. అమ్మచేతి గొరుముద్ద తెలుగుబాష వెలుగుగడ్డ.
ధన్యవాదములతో ...
మీ జగన్
ధన్యవాదములతో ...
మీ జగన్
Posted by
Sneha Hastam
0
comments
Read More
Tuesday, August 21, 2012
అన్నదానం
అన్ని దానలలోను ఉన్నతమైన దానం అన్నదానం. ఆకలితో అలమటిస్తున్న పేదవారు ఎంతో మంది మనకు కనిపిస్తుంటారు. అలాంటి వారికీ పట్టేడన్నం పెట్టె కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది స్నేహహస్తం స్వచ్చంద సేవా సంస్ద. మీ ఇళ్ళలో జరిగే వివాహాది శుభకార్యాలలో మిగిలిపోయే ఆహార పదార్దలను బయట పడవేయడం జరుగుతుంది.అలా పడవేయడం వల్ల ఎవరికి ఉపయోగ పడదు .అంతే కాకుండా డబ్బు కూడా వృధా అవుతుంది. కాబట్టి కాజులూరు మండలం లో ఎక్కడ ఏ కార్యక్రమం జరిగిన మిగిలిపోయిన ఆహార పదార్దాలను దయచేసి 99 51 71 61 98 ఈ నెంబర్ కు ఫోన్ చేస్తే వెంటనే వచ్చి ఆ ఆహార పదార్దాలను ఆకలితో అలమటిస్తున్న పేదలకు పంచిపెట్టడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మీ అందరి సహకారం కోరుతూ .....
మీ
జగన్
జగన్
ఫౌండర్ & చైర్మన్
Posted by
Sneha Hastam
0
comments
Read More
Friday, October 28, 2011
స్నేహ హస్తం
ప్రతి ఒక్కరికి సమాజ స్పృహ అనేది ఉండాలి, దేశ భవిష్యత్ యువకుల ఫై ఆదారపడి ఉందని, భావి తరాలకు మంచి ఆదర్శ జీవనం గల యువకులను తయారు చేయాలనీ స్వామి వివేకానంద పిలుపునిచ్చారు.
ఆయన యొక్క జీవన గమనాన్ని పుస్తకాల రూపంలో చదివిన నేను, నేను గ్రహించిన విషయాలను మీతో పంచుకోవాలని భావిస్తున్నాను.
ఏ వ్యక్తి అయితే సమాజాన్ని తన కుటుంబంగా భావించి, తన వ్యక్తిగత జీవితం కూడా లెక్క చేయడో అటువంటి వ్యక్తి మరొక వివేకానంద కావచ్చు.
ఎదుటి వ్యక్తి నుండి ప్రేమను, అనురాగాన్ని, ఆప్యాయతను, మనవాడు అనే భావనను కేవలం స్నేహం ద్వార మాత్రమే పొందగలం. అందరు శారిరిక రుగ్మతలతో భాదాడుతున్నామని భావిస్తుంటారు, అంతే కాకుండా అంగ వైకల్యం గల వ్యక్తులను చూసి జాలి పడతారు, కానీ ఇప్పుడు సమాజంలో శారిరిక రుగ్మతలతోను, అంగ వైకల్యంతోను భాదపడడం లేదు, కేవలం మానసిక రుగ్మతలతో మాత్రమే భాదపడుతున్నారు. మానసిక ఆరోగ్యం గల వ్యక్తీని శారిరిక రుగ్మతలు గాని, ఆర్దిక సమస్యలు కానీ భాదించవు. ఏ వ్యక్తీ అయితే ఆర్ధిక స్వాతంత్ర్యం ఉంటుందో, ఆ వ్యక్తి ఆలోచన విదానం సమాజానికి మేలు చేసే విదంగా ఉంటుంది.


-- జగన్ (ఫౌండర్ & చైర్మన్)
స్నేహ హస్తం స్వచ్చంద సేవా సంస్ధ
Posted by
Sneha Hastam
16
comments
Read More
Subscribe to:
Posts (Atom)







